అక్రిడిటెడ్ జర్నలిస్టులకు టోల్ ఫీ మినహాయింపు ఇవ్వండి

అక్రిడిటెడ్ జర్నలిస్టులకు టోల్ ఫీ మినహాయింపు ఇవ్వండి
  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి  విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినతి

 న్యూఢిల్లీ, ముద్ర ప్రతినిధి:  ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడిటెడ్ జర్నలిస్టులందరికీ, ఆయా జాతీయ రహదారులపై వసూలు చేసే టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవేలు, రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. న్యూఢిల్లీలో  మంగళవారం ఆయన కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందించారు. బ్రేకింగ్ న్యూస్, న్యూ స్టోరీస్, పౌర సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు  ముఖ్యమైన వ్యక్తుల ఇంటర్వ్యూల కోసం తమ సొంత ఖర్చులతో జర్నలిస్టులు తిరుగుతున్నారని తెలిపారు. సమాజ శ్రేయస్సు తో పాటు వార్తల పట్ల ఉన్నఆసక్తి, అంకితభావం, నిబద్ధత కారణంగా టోల్ ఫీజు ఖర్చుల కోసం జర్నలిస్టులు తమ సొంత డబ్బును వెచ్చిస్తున్నారని ఎంపీ అప్పలనాయుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వివరించారు. తాను ఒక తెలుగు దినపత్రికలో గ్రామీణ విలేకరిగా పనిచేస్తూ పార్లమెంటుకు వచ్చానని, ఇదే విషయాన్ని మీకు తెలియజేసేందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ఒక జర్నలిస్టుగా వారి మనోవేదనలను మీ దృష్టికి తీసుకు రాగలుగుతున్నానని మంత్రికి వివరించారు. దయచేసి 

ఇకనుంచి భారత ప్రభుత్వంలోని ఇతర కోర్ డిపార్ట్మెంట్లు మాదిరిగానే సమాజ అభివృద్ధి పట్ల జర్నలిస్టుల నిబద్ధతను పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ రహదారులలో గుర్తింపు పొందిన జర్నలిస్టుల అందరికీ టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రమంత్రికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు సమాజ శ్రేయస్సు తోపాటు వార్తల పట్ల ఉన్న ఆసక్తి, అంకితభావం, నిబద్ధత  కారణంగా టోల్ ఫీజు ఖర్చుల కోసం తమ సొంత డబ్బును వెచ్చిస్తున్నారని స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తించడంలో జర్నలిస్టుల క్షేత్రస్థాయి సమస్యల గురించి నాకు క్షుణ్ణంగా తెలుసునని మంత్రికి వివరించారు. ఆయా జాతీయ రహదారుల్లో  వారి వారి పరిధిని బట్టి గుర్తింపు పొందిన జర్నలిస్టులు అందరికీ టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చేందు కోసం జర్నలిస్టుల విజ్ఞాపనలను మంత్రి పరిగణలోకి కోవాలనికోరారు. టోల్ ఫీజు మినహాయింపు అమలు  జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ఇది ఎంతగానో జర్నలిస్టులకు సహాయపడుతుందని ఎంపీ అప్పలనాయుడు పేర్కొన్నారు.