భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్ట్

భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్ట్

కాటారం డి.ఎస్.పి రామ్మోహన్ రెడ్డి వెల్లడి

కాటారం, ముద్ర న్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలో మంగళవారం రాత్రి భార్యను గొంతునులిమి హత్య చేసిన కేసులో నిందితుడు మూడెత్తుల రమేష్ (35) ను గురువారం అరెస్టు చేసినట్లు కాటారం డి. ఎస్.పి రామ్మోహన్ రెడ్డి వెళ్ళడించారు. గురువారం కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మూడెత్తుల లక్ష్మి బస్సు డ్రైవర్తో అక్రమ సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో భర్త మూడెత్తుల రమేష్ ఈనెల 5 వ తేదీన తెల్లవారుజామున గొంతు పిసికి హత్య చేసినట్లు తెలిపారు.

కాగా కొయ్యూరు పోలీస్ స్టేషన్లో నిందితుడు మూడెత్తుల రమేష్ గురువారం లొంగిపోయినట్టు ఆయన తెలిపారు.నిందితుడు రమేష్ తను చేసిన నేరం ఒప్పుకోవడంతో స్టేట్మెంట్ రికార్డు చేసి భూపాలపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు డిఎస్పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు ,ఎస్సై జి.సుధాకర్ లు పాల్గొన్నారు.