జగన్‌ మళ్లీ గెలిచే పరిస్థితి లేదు: చంద్రబాబు

జగన్‌ మళ్లీ గెలిచే పరిస్థితి లేదు: చంద్రబాబు

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ప్రజా విజయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ప్రజా తీర్పును జగన్‌ సర్కార్‌పై తిరుగుబాటుగా చూడాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్లు రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారని.. చైతన్యం, బాధ్యతతో వచ్చి ఓట్లేశారన్నారు.

నాలుగేళ్లలో జగన్‌ విధ్వంస పాలన కొనసాగించారని చంద్రబాబు విమర్శించారు. ''జగన్‌ బాధ్యత లేని వ్యక్తి.. మోసాలు చేయడంలో దిట్ట. ఆయనది ధనబలం.. రౌడీయిజం.. అవి ఎప్పటికీ శాశ్వతం కాదు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ గెలిచే పరిస్థితి లేదు'' అని ఆయన అన్నారు.