నగర వాసులకు శుభవార్త - ఆ రోజున రాపిడో ఉచిత రైడ్స్

నగర వాసులకు శుభవార్త - ఆ రోజున రాపిడో  ఉచిత రైడ్స్

ముద్ర,హైదరాబాద్:- ఈ నెల 13న తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ పెంచడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్,రాపిడో కలిసి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.  హైదరాబాద్ లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా రాపిడో సంస్థ ఓటర్ల కోసం ఉచితంగా సేవలు అందించనుంది.

పోలింగ్ బూత్ నుంచి ఫ్రీగా ఓటర్లను ఇంటికి చేర్చనుంది. ఇందుకోసం ఓటర్లు “VOTE NOW” ప్రోమో కోడ్ ను వినియోంచుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సీఈఓ వికాస్ రాజ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ అనుదీప్, రాపిడోకు చెందిన 600 మంది ట్యాక్సీ కెప్టెన్లు పాల్గొన్నారు.