నడి రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు

ముద్ర వార్తలు, ఆంధ్రప్రదేశ్: ఎన్నికల విధులలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న వేళ... బహిరంగంగా ప్రజలంతా చూస్తుండగానే ఇద్దరు కానిస్టేబుళ్లు బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా రొల్ల మండలం పిల్లిగుండ్ల చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీ సమయంలో రొళ్ల పీఎస్ కు చెందిన నారాయణస్వామి నాయక్, అగళి పీఎస్ కు చెందిన శివకుమార్ బహిరంగంగా ప్రజలంతా చూస్తుండగానే కొట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.