ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్...
ముద్ర,తెలంగాణ:-ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా రోజు ఎక్కడోచోట యువతీ, యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతునే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సదాశివపేట్లో బీటెక్ చదువుతున్న వినీత్ అనే విద్యార్థి అప్పులు చేసి ఐపీఎల్లో బెట్టింగ్లకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో చేసేదేంలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.