ప్రేమించిన యువతి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య..

ప్రేమించిన యువతి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య..

రాజేంద్రనగర్ బుద్వేల్ లో విషాదం

ముద్ర, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రాణంగా ప్రేమించిన యువతి మోసం చేసి మరో యువకుడితో వివాహానికి సిద్ధమైన విషయాన్ని జర్నించుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం బుద్వేల్ లో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు సూసైడ్ నోట్ తోపాటు సెల్ఫీ వీడియో తీసి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా చౌడపూర్ కు చెందిన ప్రవీణ్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు.

ప్రవీణ్ బుద్వేల్ లో నివాసం ఉంటున్నాడని, గత కొంతకాలంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. కానీ ప్రేమించిన అమ్మాయి ప్రవీణ్ ను కాదని మోసం చేసి మరో యువకుడితో వివాహానికి సిద్దమైందని, ఈ విషయాన్ని జీర్ణించుకోలేక సూసైడ్ నోట్ తోపాటు సెల్ఫీ విడియో తీసుకొని ఇంట్లో ఫ్యాన్ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డట్టు వివరించారు. తనను మోసం చేసిన యువతీతోపాటు తన ఆత్మహత్య కు కారణమైన వియజ్ భాస్కర్, అతని స్నేహితులను కఠినంగా శిక్షించాలని సెల్ఫీ విడియోలో డిమాండ్ చేశాడు. ప్రవీణ్ ఈ మద్య కాలంలో కానిస్టేబుల్ కు అర్హత సాధించి మెయిన్స్ కు ప్రీపేర్ అవుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.