భార్య ఆత్మహత్య - భర్త ఆత్మహత్య యత్నం
ముద్ర, నిర్మల్ ప్రతినిధి : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నరసింహ నగర్ ప్రాంతానికి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకోగా, భర్త ఆత్మహత్య యత్నం చేసుకున్న విషాద సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే ఈరేవార్ దీప(22) కు సాయి తో ఏడాది క్రితం వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం కూడా వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. అనంతరం భర్త లేని సమయంలో దీప ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తో భయపడిన సాయి కుబీర్ క్రాస్ రోడ్ లోని ట్రాన్స్ఫార్మర్ ను ముట్టుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సమాచారాన్ని స్థానికులు చేరవేయటంతో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.