పంట పొలాల్లాలో మిర్చి దొంగతనం చేసిన నిందితులు పట్టివేత..!

పంట పొలాల్లాలో మిర్చి దొంగతనం చేసిన నిందితులు పట్టివేత..!

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి, మల్దకల్: వారం రోజుల క్రితం బిజ్వారం గ్రామ పరిధిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లాలో మిర్చి దొంగతనానికి ప్రయత్నించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి అట్టి దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తులు గుర్తించి విచారించగా వారు వారి నేరాన్ని ఒప్పుకున్నారు.

అదేవిధంగా ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా దొంగతనానికి పాల్పడి దొంగిలించిన నాలుగు బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపగా జడ్జి జైలుకు పంపించడం జరిగిందని మల్డకల్ ఎస్ఐ ఆర్ శేఖర్ తెలిపారు.