ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుని ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుని ఆత్మహత్య

కోరుట్ల, ముద్ర: కోరుట్ల పట్టణనికి చెందిన ఇందూరి నరసింహ చారి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే అతను వృత్తిరీత్యా అవుసుల పనిచేసుకుంటూ జీవనోపాధి వెళ్ళదీస్తున్న కార్మికుడు ప్రస్తుత పరిస్థితుల రీత్యా స్వర్ణకారులకు జీవనోపాది లేకుండా రెడీమేడ్ నగలకు అలవాటైనా జనాలు పొట్ట చేత పట్టుకొని జీవిస్తున్నారు.

స్వర్ణకారులు కులవృత్తి దైవంగా భావిస్తూ వేరే ఎలాంటి పనులు తెలియకుండా గడుపుతున్న కార్మికులు ఇంటి భారం మోయలేక, అప్పులు చేయలేక ఇలాగా ఆత్మహత్యలకు దారి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. తండ్రి ఇందూరి వెంకట్రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్టు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.