కేసీఆర్ రెండుసార్లు సీఎంగా అధికారంలో ఉండి.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పగలరా?

కేసీఆర్ రెండుసార్లు సీఎంగా అధికారంలో ఉండి.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పగలరా?
  • కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా?
  • మాట తప్పక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిది, జగిత్యాల: కేసీఆర్ రెండుసార్లు సీఎంగా అధికారంలో ఉండి.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పగలరా? కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హత్ సే హత్ జోడో యాత్రలో బాగంగా కోరుట్లలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాట తప్పక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండని కోరుట్ల ప్రాంత ప్రజలను కోరారు. ఈ ప్రాంతంలో పసుపు రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు, ఎకరాకు లక్ష 50వేలు పెట్టుబడి పెడితే.. వారికి ఆత్మహత్యలే దిక్కవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆనాడు రత్నాకర్ రావు చేసిన అభివృద్దే తప్ప బీఆరెస్ చేసిందేం లేదు బీఆరెస్ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నిచారు.2011లో శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ బీఆరెస్ కు మద్దతు తెలిపింది.కోట్ల రూపాయలు తీసుకుని ఆనాడు ఈ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముడుపోయింది వాస్తవం కాదా? ఆనాడు టీఆరెస్ నుంచి నిన్ను సస్పెండ్ చేసింది నిజం కాదా? తన ఓటును ఆంధ్రోళ్లకు అమ్ముకున్న విద్యా సాగర్ రావుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ టికెట్ ఇచ్చారు.

అంటే ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయినదాంట్లో కేసీఆర్ వాటా ఎంత చెప్పాలన్నారు.100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని కవిత హామీ ఇచ్చారు.పరిశ్రమను తెరవకపోతే గేటుకు ఉరేసుకుంటానని ఎమ్మెల్యే అన్నడుమాట తప్పిన కవితను పార్లమెంటు ఎన్నికల్లో పాతాళానికి తొక్కిండ్రు.. మరి కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ఎందుకు విడిచిపెట్టిండ్రు? మీరు తలచుకుంటే కవితనే పాతాళానికి తొక్కిండ్రు...విద్యాసాగర్ రావు ఒక లెక్కనా? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో చక్కెర పరిశ్రమను తెరుస్తామన్నారు. పసుపు బోర్డు తెస్తానన్న గుండు.. బోర్డు తిప్పేశారు. ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ తెచ్చిన అని చెప్పుకున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.

తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నేరవేర్చలేదు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ ను అసదుద్దీన్ ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు.  2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం.ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకుంటాం.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జువ్వాడినర్శింగరావు, అడ్లూరి లక్ష్మన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.