జగిత్యాల విద్యార్థికి డాక్టరేట్ 

జగిత్యాల విద్యార్థికి డాక్టరేట్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :  జగిత్యాల జిల్లా  గొల్లపల్లి మండలం చిలువకోడూరు గ్రామానికి చెందిన  కందుకూరి పూర్ణచందర్   పశు వైద్య పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. పూర్ణ చందర్ కవిత దంపతుల కూతురు  మౌనిక ఉస్మానియా యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ విభాగంలో డాక్టరేట్  పట్టా  సాధించింది.  

మౌనిక 10వ  తరగతి వరకు జగిత్యాల పట్టణంలోని చైతన్య కాన్సెప్ట్ లో, ఇంటర్ కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ లో పూర్తి చేసి జగిత్యాల  ఎన్ ఎస్ వి డిగ్రీ కళాశాల బిఎస్సి బి జెడ్ సి వరకు చదువుకుంది. అనతరం ఉస్మానియా యూనివర్సిటీలో సాటిస్టిక్స్ లో పిజి చేసి, సాటిస్టిక్స్ పీహెచ్డీ పూర్తి చేయగా డాక్టరేట్ పట్టా వచ్చింది.  ఈ సందర్బంగా మౌనికను కుటుంబ సభ్యులు, సహా ఉద్యోగులు, విద్య సంస్థల డైరెక్టర్ల్ అబినంధించారు.