చిన్న చిత్రాలను ఆదరించండి... ప్రముఖ దర్శకుడు రాజ్ నరేంద్ర

చిన్న చిత్రాలను ఆదరించండి...  ప్రముఖ దర్శకుడు రాజ్ నరేంద్ర

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాకు చెందిన యువ హీరోలు    వెంకీ ఈశాన్ సందీప్ సక్సేన సాయిరాజ్ దాలియా షరీఫా స్నేహ శర్మ నటించినచిత్రం బైరాన్ పల్లి , చిత్ర నిర్మాతగా నరేష్ వర్మ,వెంకట్ కాచర్ల దర్శకత్వంలోరూపొందించన చిత్రాన్ని ఆదరించాలని ప్రముఖ దర్శకుడు రాజ్ నరేందర్ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత చిన్న హీరోలు నటించిన చిత్రాలకు ఆదరణ పెరిగిందని, ప్రాంతీయ నటులను ఆదరించి ప్రోత్సాహం అందించాలని రాజ్ నరేందర్ పేర్కొన్నారు. జగిత్యాల దుర్గ థియేటర్ లో శుక్రవారం ఉదయం ఆటతో విడుదలైన బైరాన్ పల్లి చిత్రాన్ని అందరూ చూడాలని కోరారు. ఈ సందర్భంగా థియేటర్ లో కేకు కత్తిరించి, భారీ ఎత్తున బాణా సంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు చంద్ర ప్రకాష్ రావు, న్యాయవాది భూసారపు శ్రీనువాసు గౌడ్, గుగ్గిళ్ల రామ్, కనపర్తి మహేష్, ఎలిగేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.