కొండగట్టులో హుండీ లెక్కింపు- అంజన్నకు 97 లక్షల ఆదాయం

కొండగట్టులో హుండీ లెక్కింపు- అంజన్నకు 97 లక్షల ఆదాయం

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. 40 రోజులకు సంబందించిన హుండీలను లెక్కించగా, రూపాయలు 97 లక్షల 96 వేల 732 నగదు సమకూరినట్లు, అలాగే 15 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కేజీల 900 గ్రాముల వెండి, 20 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో టoకశాల వెంకటేష్, ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ టి. మారుతి, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, సూపరిండెంట్ సునీల్, తదితరులు పాల్గొన్నారు.