వీటీపీఎస్‌లో తెగిన లిఫ్ట్‌ వైరు.. ముగ్గురి మృతి

వీటీపీఎస్‌లో తెగిన లిఫ్ట్‌ వైరు.. ముగ్గురి మృతి

ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో లిఫ్ట్‌ వైరు తెగడంతో అమాంతం ఊడి కిందకు పడిపోయింది.
ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ప్రమాదం సమయంలో లిఫ్ట్‌ ఎనిమిది మంది ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.