నోరు అదుపులో పెట్టుకో బండి సంజయ్
- మహిళలతో పెట్టుకుంటే చరిత్రలో లేకుండా పోతావు
- మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి
ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మహిళలోకం ఖండించాలని మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ మార్చి 8 మహిళా దినోత్సవం రోజు ఈడి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందజేయడం మహిళలను అవమానించడమేన్నారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉండి బండి సంజయ్ ఒక ఉన్నతమైన పదవిలో కొనసాగుతూ తెలంగాణ కీర్తిని ప్రపంచ నలుమూలలో చాటిన మహిళపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో బిజెపి పార్టీకి, మహిళా లపై ఉన్న గౌరవం ఏమిటో అర్థం అవుతుందన్నారు.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళసై ఒక మహిళగా స్పందించి చర్యలు తీసుకోవాలని, మహిళల్ని అవమానిస్తూ కించపరుస్తున్న ఒక పార్టీకి అధ్యక్షుడు హోదాలో బండి సంజయ్ కొనసాగే అర్హత లేదని, తక్షణమే సంజయ్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.