జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ అనుదీప్
ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉపాధి మరియు శిక్షణశాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డి అనుదీప్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు సంబంధించి ఉపాధి కల్పన అధికారి శాఖ ద్వారా రూపొందించిన గోడపత్రిక ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ప్రైవేటు కంపెనీలలో ఉపాధి కల్పించడానికి ఈ నెల 28వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించబడుతున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగూడెం క్లబ్ లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు.