ధ్వజస్తంభ మహోత్సవం కు హాజరైన పువ్వాడ
ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగుడెం గ్రామంలో ని సీతా సీతారామచంద్ర స్వామి హనుమాన్ లక్ష్మణ సహిత స్వామి వార్ల ధ్వజస్తంభం మహోత్సవంకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం యాగశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అశ్వరావుపేటఎమ్మెల్యే. మెచ్చ నాగేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు