మన ఊరు మన బడి పనులను పరిశీలించిన రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి
![మన ఊరు మన బడి పనులను పరిశీలించిన రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63fa22278086c.jpg)
ముద్ర, మల్యాల: ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చేపట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం తెలంగాణ రాష్ట్ర విద్య సంక్షేమం వనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రేగుల శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అన్నారు.
కార్యక్రమంలో జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మంద మకరందం తో పాటు జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈ ఈ రెహమాన్, డిప్యూటీ ఈ మనోహర్ రావు, మండల విద్యాధికారి శ్రీనివాస్, తహసిల్దార్ సుజాత ఎంపీడీవో వాసవి, గ్రామ సర్పంచ్ గడ్డం జలజ మల్లారెడ్డి,మండల కో ఆప్షన్ సభ్యులు హాజరుద్దీన్, విద్య కమిటీ చైర్మన్ రవిలు పాల్గొన్నారు.