సజ్జల నుంచి నాకు ప్రాణహాని: ఉండవల్లి శ్రీదేవి

సజ్జల నుంచి నాకు ప్రాణహాని: ఉండవల్లి శ్రీదేవి

సజ్జల నుంచి తనకు ప్రాణహాని ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. సోషల్​ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నిన్నటి నుంచి శ్రీదేవి ఎక్కడ అంటున్నారు. నేనేమైనా గ్యాంగ్​స్టర్​నా? వైసీపీ గూండాలు నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు. ఉద్దండరాయపాలెంలో ఇసుక మాఫియా ఎవరిది? మొదటి నుంచి కావాలనే నాపై కుట్రలు చేస్తున్నారు. నేను ఓటుకు నోటు తీసుకున్నానని ముద్ర వేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుంచే నాపై కుట్రలు చేశారు. గతంలో డాక్టర్​ సుధాకర్, డాక్టర్​ అచ్చెన్న ​ఎలా చనిపోయారో తెలుసు. రేపు డాక్టర్​ శ్రీదేవి చనిపోకూడదనే ఉద్దేశంతోనే వెళ్ళిపోవడం జరిగింది. దోచుకో, పంచుకో, తినకో అని సీఎం జగన్​ చెబుతున్నారు. జగనన్న ఇళ్ళ పథకంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. మన రాజధాని అమరావతి. అమరావతి కోసం ప్రాణం ఉన్నంతవరకూ పోరాటం చేస్తా. అమరావతిలో జరిగిన అభివృద్ధిలో 10 శాతమైనా చేశారా?