టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

గుంటూరు : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజ శ్యామల యాగం చేపట్టారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా  మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది.