ఢిల్లీలోని ప్రైవేట్ స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ఏరియాలోగల ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం స్కూల్కు సెలవు కావడంతో బస్సులన్నింటిని స్కూల్ ఆవరణలో పార్క్ చేశారు. ఆ పార్కు చేసి ఉన్న బస్సుల్లోనే ఒక బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.