లాలు తండా వద్ద ఆటో ఫల్టీ 8 మందికి తీవ్ర గాయాలు
(కేసముద్రం -ముద్ర): ఇనుగుర్తి మండలం లాలు తండా వద్ద శనివారం రాత్రి ఆటో ఫల్టీ కొట్టిన ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నెల్లికుదురు మండలం జామ తండా కు చెందిన కొందరు పర్వతగిరి మండలం అన్నారం గ్రామానికి ఒక వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా లాలు తండా ఇనుగుర్తి మార్గమధ్యలో చెరువు కట్ట సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆటో ప్రమాదంలో గాయపడ్డ వారిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.