ఆటోలో నుంచి పడి పోలీసు మృతి

ఆటోలో నుంచి పడి పోలీసు మృతి

ముద్ర, జనగామ ప్రతినిధి: నగరంలోని పంజగుట్టలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గోల్కొండ స్వామి (36) గురువారం జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నర్మెట్ట నుంచి జనగామకు ఆటోలో పోతుండగా ఈ  ఘటన జరిగింది. కుదుపులకు ఆటోలో నుంచి కానిస్టేబుల్ స్వామి ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. అయితే, మార్గ మధ్యంలోనే స్వామి ప్రాణాలు వదిలారు.