గండివేట్ లో బిఆరెస్-కాంగ్రెస్ మధ్య ఘర్షణ

గండివేట్ లో బిఆరెస్-కాంగ్రెస్ మధ్య ఘర్షణ

కత్తిపోట్లలో ముగ్గురికి తీవ్ర గాయాలు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలోని గాంధారి మండలం గండివేట్ గ్రామంలో కాంగ్రెస్,బిఆరెస్ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా కత్తు లతో దాడులకు పాల్పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణలో ఒకరికి కత్తిపోట్లు పరిస్థితి విషమించడంతో బాన్స్వాడ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.