మెదక్ జిల్లా రేగోడు మండలం తాటిపల్లి వద్ద దారిదోపిడి

మెదక్ జిల్లా రేగోడు మండలం తాటిపల్లి వద్ద దారిదోపిడి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా రేగోడు మండలం తాటిపల్లి వద్ద సోమవారం రాత్రి దారిదోపిడి జరిగింది. ఐటీసీ ఏజెన్సీ వాహనాన్ని అడ్డగించిన ముసుగు దొంగలు ద్విచక్ర వాహనాలపై వచ్చి డ్రైవర్, సిబ్బందిపై దాడి చేశారు. వారి నుంచి నగదు, బిల్లు బుక్కులు, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. 7 నుంచి 8 లక్షల వరకు నగదు ఉంటుందని ఐటీసీ ఏజెన్సీ సిబ్బంది  తెలిపారు.