కుటుంబ కలహాలతో మహిళ హత్య

కుటుంబ కలహాలతో మహిళ హత్య

ముద్ర ప్రతినిధి, జనగామ: కుటుంబ కలహాలతో ఓ మహిళను హత్య చేసిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. నర్మెట్ట మండలం బొమ్మకూరుకు చెందిన మాలోత్ విజయ, తిరుపతి దంపతులకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. బతుకు దెరువు కోసం జనగామకు వలస వచ్చిన వారు పట్టణంలోని గుండ్లగుడ్డలో ఉంటున్నారు. కొన్నేళ్ల కింద విజయ భర్త తిరుపతి కుటుంబ కలహాలతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఇదే సమయంలో మరిది మోహన్ ఆమెకు దగ్గర అయ్యాడు. శనివారం రాత్రి ఆమె ఇంటికి వచ్చిన మోహన్ కు చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో క్షణికావేవేశానికి గురైన మోహన్ ఆమె తలపై రోకలి బండతో మోదాడు. స్థానికులు హాస్పిటల్ కు తరలించగా ఆమె మృతి చెందింది