యాక్సిడెంట్ లో ఒకరి మృతి
![యాక్సిడెంట్ లో ఒకరి మృతి](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_641f4af56bc89.jpg)
ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ పట్టణం లోని హైదరాబాద్ రోడ్ లో శనివారం అర్ధరాత్రి జరిగిన యాక్సిడెంట్ లో ఒకరు మృతి చెందారు. లింగాలఘనపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన కొల్లూరి దుర్గ ప్రసాద్ జనగామ నుంచి కళ్లెం వెళుతుండగా.. అదే రూట్ లో హైదరాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ కార్గో బస్సుకు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.