నేరాల నిర్మూలనే తమ లక్ష్యం..

నేరాల నిర్మూలనే తమ లక్ష్యం..

రామకృష్ణాపూర్,ముద్ర: నేరాల నిర్మూలనే తమ లక్ష్యమని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమడుగు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని రాత్రి నిర్వహించారు. ఈ సందర్బంగా సరైన పత్రాలు లేని 25 వాహనాలను సీజ్ చేసినట్లుగా సీఐ తెలిపారు.అనంతరం మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై అశోక్,మందమర్రి ఎస్సై చంద్రకుమార్,కాసిపేట ఎస్సై గంగారాం,దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..