గ్రామాల అభివృద్ధే లక్ష్యం

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

జనగామ కలెక్టర్‌‌ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ :గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జనగామ కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య తెలిపారు. బుధవారం జిల్లాలని రఘునాథపల్లి మండలం ఖిలా షాపూర్, నిడిగొండ గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను బుధవారం ఆయన  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 23వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. గ్రామ కార్యదర్శి ఉదయం 7 గంటలకే గ్రామాల్లో ఉండి జరుగుతున్న పనులను తనిఖీ చేయాలని సూచించారు.

విధుల్లో అలసత్వం వహించిన కొడకండ్ల మండల పంచాయతీ అధికారి ఇందిర, రఘునాథపల్లి మండలం ఖిలా షాపూర్ గ్రామ కార్యదర్శి కే.జ్యోతి, లింగాలగణపురం మండలం పటేల్ గూడెం గ్రామ కార్యదర్శిలకు సాయికుమార్‌‌కు మెమోలు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రంగాచారిని ఆదేశించారు. నర్సరీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ లింగాలగణపురం మండలం పటేల్ గూడెం గ్రామంలో పారిశుద్ధ్య పనులతో పాటు గ్రామంలోని నర్సరీని, సగ్రిగేషన్ షెడ్డును అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తనిఖీ చేశారు. విధుల పట్ల ఎవరూ అలసత్వం వహించవద్దని సూచించారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, రఘునాథపల్లి ఎంపీడీవో హసీం, గ్రామ కార్యదర్శి ఉన్నారు.