ఇస్తే ముత్తిరెడ్డి.. లేకుంటే పొచంపల్లి
![ఇస్తే ముత్తిరెడ్డి.. లేకుంటే పొచంపల్లి](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64ecaac578902.jpg)
జనగామ టికెట్పై టీఆర్ఎస్వీ తీర్మాణం
ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ నియోజకవర్గ టికెట్ ఇస్తే ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి లేకుంటే పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి ఇవ్వాలని టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణీత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం జనగామలో జరిగిన యూత్ సమావేశంలో ఈ మేరకు తీర్మాణం చేసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు పంపారు. ఈ ఇద్దరు కాకుండా ఎవరకి టికెట్ ఇచ్చినా పార్టీ మనుగడకు ప్రమాదం ఉంటుందని అందులో పేర్కొన్నారు. జనగామ పట్టణ అభివృద్ధి దృష్టి ఉంచుకుని సమర్థులైన ఈ ఇద్దరిలో ఎరికైనా టికెట్ ఇవ్వాలని కోరారు. సమావేశంలో శ్రావణ్, లక్ష్మణ్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.