ఓటేసినా అధికారులు

ఓటేసినా అధికారులు

జనగామ టౌన్, ముద్ర: ఎన్నికల విధుల్లో పాల్గొనే పలువురు అధికారులు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాలోని పోస్టల్ బ్యాలెట్ (ఫెసిలిటీ సెంటర్)లో జిల్లా అధికారులు స్వీప్ నోడల్ ఆఫీసర్ వి.వినోద్ కుమార్, డీపీఆర్ఓ పి.రాజేంద్రప్రసాద్, బచ్చన్నపేట, తరిగొప్పుల తహసీల్దార్లు నాగదివ్య, విశాలాక్షి ఓటేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ వచ్చిన వారు, ఓటు వేయని ఉద్యోగులు వెంటనే ఓటు వేయాలని కోరారు.