ప్రజా వైద్యులుగా గుర్తింపు తెచ్చుకోవాలి ...: ఎమ్మెల్యే రాజయ్య

ప్రజా వైద్యులుగా గుర్తింపు తెచ్చుకోవాలి ...: ఎమ్మెల్యే రాజయ్య

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజా వైద్యులుగా గుర్తింపు తెచ్చుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్స్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు సకాలంలో సరైన వైద్యం అందించి ప్రజా వైద్యులుగా పేరు తెచ్చుకోవాలన్నారు.

అనంతరం ఎమ్మెల్యేను స్థానిక వైద్య సిబ్బంది వివిధ శాఖల అధికారులు సత్కరించగా వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ సుగుణాకర్ రాజు, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ సుధీర్, స్థానిక ఆసుపత్రి సూపరిండెంట్ సంధ్య, వైద్యులు జనార్ధన్, మానస, సంధ్య, ప్రసన్న, జునైది, అజయ్ ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. “ఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ” అనంతరం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 52 మందికి రూ.25 లక్షల 50 వేల 5 వందల విలువ చేసే సీఎంఆర్ చెక్కులను ఎమ్మెల్యే అందించారు.