పాఠాలు చెబుతూ గుండెపోటుతో టీచర్​ మృతి

పాఠాలు చెబుతూ గుండెపోటుతో టీచర్​ మృతి

ఒంగోలు: స్కూల్లో  విద్యార్థుల కు పాఠాలు చెబుతూ ఓ ఉపాధ్యాయుడు  ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు.  గుండెపోటు కారణంగా ఆ ఉపాధ్యాయుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఒంగోలు జిల్లా వాకవారిపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు బాపట్ల జిల్లా పంగళూరుకు చెందిన పాలపర్తి వీరబాబుగా చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో వీరబాబు హెడ్మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం యధావిధిగా విధులకు హాజరైన అతను పాఠాలు చెబుతూ గుండెపోటు రావడంతో అపస్మారకస్థితోలోకి చేరుకున్నారు. విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వెంటనే వారు 108కు కాల్ చేశారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని టీచర్‌కు చికత్స అందించారు. అయితే వీరబాబు అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు.