దిల్లీ లిక్కర్ స్కామ్.. మాగుంట రాఘవ కస్టడీ పొడిగింపు
దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ జ్యుడిషియల్ కస్టడీని సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. రాఘవ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది. ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. 14 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తిహాడ్ జైలులో రాఘవ ఉన్నారు. మార్చి 13న రాఘవ బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. కాగా ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.