వర్షాలు, వరదలతో 9మంది మృతి-రూ. 104 కోట్ల నష్టం

వర్షాలు, వరదలతో 9మంది మృతి-రూ. 104 కోట్ల నష్టం

హిమాచల్​ప్రదేశ్: హిమాచల్​ప్రదేశ్​ను వరదలు వణికిస్తున్నాయి. 24వ తేదీ నుండి రాష్ర్టంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల వల్ల మంగళవారం వరకూ 9మంది మృతి చెందినట్లు, 14 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు ఇళ్లు పూర్తి నేలమట్టమయ్యాయన్నారు. 28 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. రాష్ర్ట విపత్తుల శాఖాధికారి ఓంకార్​ చంద్​ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. ఆర్థికపరంగా చూసుకుంటే రూ. వర్షాలు, వరదల వల్ల రూ. 104 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. మరోవైపు రానున్న ఐదు రోజులు రాష్ర్టంలో వర్షాలుంటాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. హిమాచల్​లోని పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్, ఎల్లో అలర్ట్​లు జారీ చేశారు.