రేపే కింగ్ చార్లెస్–3  పట్టాభిషేకం.. ముస్తాబైన బంకింగ్ హామ్​ ప్యాలెస్​ 

రేపే కింగ్ చార్లెస్–3  పట్టాభిషేకం.. ముస్తాబైన బంకింగ్ హామ్​ ప్యాలెస్​ 

న్యూఢిల్లీ: కింగ్ చార్లెస్–3 పట్టాభిషేకం సోమవారం జరుగుతుందని ఇంగ్లాండ్​లోని బంకింగ్ హామ్​ ప్యాలెస్ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అంతా సిద్ధం చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవంలో  ఉపయోగించే శుద్ధ జలానికి జెరూసలెంలో ‘చర్చ్​ఆఫ్ ద హోలీ’లో  ప్రార్థనలతో పవిత్రత చేకూర్చారు. ‘చర్చ్​ ఆఫ్​ ద హోలీ’ని క్రిస్టియన్లు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వెస్ట్​మినిస్టర్​ఎబ్బే చర్చిలో మతాధికారులు పట్టాభిషేకం సందర్భంగా ఈ పవిత్రజలాన్ని కింగ్​చార్లెస్​తలపై, ఛాతీ, చేతులపై చల్లుతారు. చార్లెస్​తోబాటు ఈయన భార్య కెమిలిపై కూడా ఈ పవిత్ర జలాన్ని చల్లుతారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు అత్యున్నత ప్రముఖులు హాజరు కానున్నారు.