రేపే కింగ్ చార్లెస్–3 పట్టాభిషేకం.. ముస్తాబైన బంకింగ్ హామ్ ప్యాలెస్
![రేపే కింగ్ చార్లెస్–3 పట్టాభిషేకం.. ముస్తాబైన బంకింగ్ హామ్ ప్యాలెస్](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640450231659a.jpg)
న్యూఢిల్లీ: కింగ్ చార్లెస్–3 పట్టాభిషేకం సోమవారం జరుగుతుందని ఇంగ్లాండ్లోని బంకింగ్ హామ్ ప్యాలెస్ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అంతా సిద్ధం చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవంలో ఉపయోగించే శుద్ధ జలానికి జెరూసలెంలో ‘చర్చ్ఆఫ్ ద హోలీ’లో ప్రార్థనలతో పవిత్రత చేకూర్చారు. ‘చర్చ్ ఆఫ్ ద హోలీ’ని క్రిస్టియన్లు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వెస్ట్మినిస్టర్ఎబ్బే చర్చిలో మతాధికారులు పట్టాభిషేకం సందర్భంగా ఈ పవిత్రజలాన్ని కింగ్చార్లెస్తలపై, ఛాతీ, చేతులపై చల్లుతారు. చార్లెస్తోబాటు ఈయన భార్య కెమిలిపై కూడా ఈ పవిత్ర జలాన్ని చల్లుతారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు అత్యున్నత ప్రముఖులు హాజరు కానున్నారు.