వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారు

వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారు

ముద్ర, వేములవాడ:  వేములవాడ రాజన్నను  కేసీఆర్ మోసం చేశారని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం వేములవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తెరాస ప్రభుత్వ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాట తప్పిందని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందని, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
పెళ్ళైన ఆడపిల్లలకు వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదని, కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా దొరలకు ఒక నీతి... గిరిజనులకు ఒక నీతా అని పేర్కొన్నారు.

మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని అన్నారు. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడిని ప్రజలు గెలిపించాలని, రానున్న ఎన్నికల్లో 
కాంగ్రెస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని కోరారు. ఆయన వెంట పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్,  అక్కన పల్లి నరేష్, శ్రీనివాస్, రాకేష్, సగ్గు దేవ రాజు సిరిగిరి శ్రీనివాస్,  తదితరులు ఉన్నారు.