కాంగ్రెస్ పార్టీ నాయకున్ని పరామర్శించిన కేకే మహేందర్ రెడ్డి 

కాంగ్రెస్ పార్టీ నాయకున్ని పరామర్శించిన కేకే మహేందర్ రెడ్డి 

ముద్ర, ఎల్లారెడ్దిపేట: ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గురక పరుశరాములును శుక్రవారం  సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం పరిషరాములు తండ్రి కొమురయ్య అనారోగ్యంతో చనిపోయారు .అదేవిదంగా రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో తడిక దశరథం కుమారుడు బాబు క్రిమిసంహారక మందు త్రాగి చనిపోగా దశరథం మనెవ్వ దంపతులను పరామర్శించారు.అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దండు శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయనను పరామర్శించారు .ఆయన వెంట జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య,  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు, చెన్ని బాబు  ,రామ్ రెడ్డి  ,రఫీక్  ,శ్రీనివాస్, సుడిద రాజేందర్  ,వంగ మల్లారెడ్డి,రోడ్డ రామచంద్రం  ,గంగయ్య ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.