307 సెక్షన్ ను ఇష్టారాజ్యంగా వాడితే ఊరుకునేది లేదు

307 సెక్షన్ ను ఇష్టారాజ్యంగా వాడితే ఊరుకునేది లేదు
  • బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పోలీసు ఇష్టారాజ్యంగా 307 సెక్షన్ ను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. శివాజీ పోరాటమే స్ఫూర్తిగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బిజెపి జండా ఎగరటమే ధ్యేయంగా పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శివాజీ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా నిర్మల్ లోని శివాజీ చౌక్ లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మొఘల్ ఆక్రమణదారులు భారతదేశంలో ప్రవేశించి దేశాన్ని చిన్నాభిన్నం చేశారని అన్నారు. అలాంటి తరుణంలో హిందూ సామ్రాజ్య స్థాపన ధ్యేయంగా కృషిచేసిన ఛత్రపతి శివాజీ నేటి యువతకు ఆదర్శం కావాలని సూచించారు. శివాజీ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా స్వీకరించి ముందుకు సాగుతామని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని, ఆ దిశగా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ పోలీసులపై విమర్శనాస్త్రాలు సంధించారు. పోలీస్ యంత్రాంగం 307 సెక్షన్ ఇష్టారాజ్యంగా  వాడుతున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని దీన్ని సరిదిద్దుకుంటే మంచిదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న గారి భూమయ్య, రావుల రామనాథ్, మెడిసిమ్మే రాజు, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.