పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు మృతి

పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు మృతి

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-విశాఖ - భీమిలికి చెందిన నరసింగరావు(59), అతని కుమారుడు భార్గవ్(27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు. కానీ అప్పటికే వీరికి మెదడు, కాలేయం భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.