నేడు సచివాలయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

నేడు సచివాలయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి పవన్ రాబోతున్నారు. నేటి. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి పవన్ చేరుకుంటారు. రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ ను పవన్ పరిశీలిస్తారు.పవన్ కల్యాణ్ అమరావతికి వస్తున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్ ను పరిశీలించిన తరువాత సీఎం చంద్రబాబు తో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.