ఏఐఎఫ్ బి పార్టీ మండల అధ్యక్షుడుగా గోపగారి లక్ష్మీనారాయణ గౌడ్ నియామకం..

ఏఐఎఫ్ బి పార్టీ మండల అధ్యక్షుడుగా గోపగారి లక్ష్మీనారాయణ గౌడ్ నియామకం..

ముద్ర, గంభీరావుపేట : ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గంభరావుపేట మండల అధ్యక్షుడుగా గోపి గారి లక్ష్మీనారాయణ గౌడ్ ను నియమించారు. ఏఐఎఫ్ బి పార్టీ,తెలంగాణ ఎలక్షన్ కమిటీ చైర్మన్  కటకం మృత్యుంజయం  ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మేకల కమలాకర్, గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన  గోపి గారి లక్ష్మీనారాయణ గౌడ్ మండల అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ సందర్భంగా గోపిగారి లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఏఐఎఫ్ బి పార్టీ,తెలంగాణ ఎలక్షన్ కమిటీ చైర్మన్  కటకం మృత్యుంజయం,   జిల్లా అధ్యక్షుడు మేకల కమలాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.మండలంలోని అన్ని వర్గాల ప్రజలను, కార్యకర్తలను కలుపుకొని గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి  కృషి చేస్తానని అన్నారు.