పేదలు సిఎంఅర్ఎఫ్ సద్వినియోగం చేసుకోవాలి జడ్పీ చైర్ పర్సన్ హేమలత గౌడ్
![పేదలు సిఎంఅర్ఎఫ్ సద్వినియోగం చేసుకోవాలి జడ్పీ చైర్ పర్సన్ హేమలత గౌడ్](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_6516995d7d45f.jpg)
తూప్రాన్, ముద్ర: ముఖ్యమంత్రి సహాయనిధిని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం మనోహరబాద్ తన క్యాంపు కార్యాలయంలో బాధితులు నాచారంకు చెందిన బి.వసంతకు 87 వేల 500, దండుపల్లి చెందిన బి నాగేందర్ కు 22500, పోచయ్యకు 37వేల 500,ఘనపూర్ కు చెందిన యాదాగౌడ్ కు 25 వేలు, మనోహరాబాద్ కు చెందిన బి. శైలేంద్రకు 38వేల 500, కామారెడ్డి కి చెందిన నాగేందర్ రావుకు 40వేలు, కళ్ళకల్ కు చెందిన మాధవికి 17వేల 500, జీడిపల్లికి చెందిన బాలేష్ 60వేలు, గణేష్ కు 35వేలు,శివంపేట కు చెందిన యాదయ్య 60వేలు రూపాయలు మంజూరు అయిన సిఎంఅర్ఎఫ్ చెక్కులను వారికి జడ్పీ చైర్ పర్సన్ అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నే నాగరాజు, బిక్షపతి, ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, సుధాకర్, రామకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.