ప్రైవేట్ పాఠశాల గోదాం సీజ్

ప్రైవేట్ పాఠశాల గోదాం సీజ్

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ పట్టణం వెంకట్రావు నగర్ కాలనీలో గల సిద్ధార్థ పాఠశాల గోదాంను విద్యాశాఖ అధికారులు మంగళవారం సీల్ చేశారు. మెదక్ జిల్లా విద్యాధికారి  ఆదేశాల మేరకు మెదక్ మండల విద్యాధికారి ఎస్. నీలకంఠం, మండల నోడల్ ఆఫీసర్ వరప్రసాద్, ఎంఆర్సి సిబ్బందితో పాఠశాల గోదామును సందర్శించారు. 

ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము పాఠశాలను నడపాలని సూచించారు. ఒకవేళ దీనికి భిన్నంగా వ్యవరిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పాఠశాల అనుమతి, ఫీజుల వివరాలు, ఉపాధ్యాయుల వివరాలు, వారి విద్యార్హతలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల వివరాలు  ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు మూడు రోజులలో మండల వనరుల  కేంద్రంలో సమర్పించాలని నీలకంఠం ఆదేశించారు.