మహిళలు అన్ని రంగాలలో ముందంజ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత రెడ్డి

మహిళలు అన్ని రంగాలలో ముందంజ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత రెడ్డి

ముద్ర ప్రతినిధి మెదక్: మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో టీఎన్జీవోల  ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్బంగా నర్సాపూర్ వివిధ రంగాలలో ప్రతి నిద్యం వహిసున్న మహిళలను సన్మానించారు. మహిళా కమీషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నింగి,నేల, సముద్రం ఎక్కడైనా మహిళలు రాణించాలన్నారు. ఆకాశమే హద్దుగా వారు ఉన్నతంగా ఎదగాలన్నారు. కొంత అక్కడక్కడ అసమానతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపడo కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక పథకాలతో పాటు చట్టాలు కూడా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుంటూ అందరికి వాటి పట్ల అవగాహన కలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమ భార్గవి, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరేందర్, ప్రధాన కార్యదర్శి  రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు