మెదక్ జట్టుకు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం 

మెదక్ జట్టుకు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం 

ముద్ర ప్రతినిధి, మెదక్: హైదరాబాద్ లో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి పురుషుల వాలీబాల్ పోటీలలో మెదక్ జిల్లా జట్టు ఫైనల్లో మహబూబ్నగర్ జిల్లా జట్టుతో హోరాహోరీగా తలపడి రెండో స్థానంలో నిలిచింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నాగార్జున్ సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు.

జిల్లా వాలీబాల్ జట్టు విజయం పట్ల క్రీడాకారులను కలెక్టర్ రాజర్షి షా, క్రీడల అధికారి నాగరాజు అభినందించారు.