టిప్పర్ దీకొని వ్యక్తి మృతి

టిప్పర్ దీకొని వ్యక్తి మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్:టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం మెదక్ పట్టణ శివారులో చోటుచేసుకుంది. మెదక్ మండలం మక్త భూపతిపూర్ గ్రామానికి చెందిన కమ్మరి పోచాద్రి ఎక్సెల్ బైక్ పై వస్తుండగా టిప్పర్ డీకొనడంతో కక్కడికక్కడే మృతి చెందాడు. మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డీసీసీ అధ్యక్షులు నివాళులు

మెదక్ మండలం బీసీ సెల్ అధ్యక్షులు మురళి  అన్న పోచాద్రి మరణించిన విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి గ్రామాన్ని సందర్శించి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంభ సభ్యులను ఓదార్చారు. వెంట పీసీసీ నాయకులు మామిళ్ల ఆంజనేయులు, మండల అధ్యక్షులు శంకర్, పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్, సిద్ధగౌడ్, గట్ట గౌడ్, ఫసి,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులున్నారు.