మెదక్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ పాల్గొన్న ఎమ్మెల్యే పద్మ, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ శేరి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో నెలకొల్పిన స్వాతంత్ర సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిలు మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ అరెళ్ల మల్లికార్జున్ గౌడ్, ఎఎంసి చైర్మన్ బట్టి జగపతి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మ్యాకల జయరాములు, ప్రతినిధులు మెట్టు గంగారాం, బొద్దుల రుక్మిణి కృష్ణ, సంతోష్, ఎంపిపి ఫోరమ్ జిల్లా అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, కౌన్సిలర్లు కిషోర్, శ్రీనివాస్, సత్యనారాయణ, భీమరి శ్రీనివాస్, రాంచంద్రం, బుడ్డ రాజు తదితరులు పాల్గొన్నారు.