బిజెపిలో చేరిన జెడ్పిటిసి పంజా కండువా కప్పిన ఈటెల

బిజెపిలో చేరిన జెడ్పిటిసి పంజా కండువా కప్పిన ఈటెల

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా నిజాంపేట  జడ్పిటిసి పంజా విజయ్ కుమార్ ఈటెల రాజేంద్ర సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. గురువారం మెదక్ లో ర్యాలీ అనంతరం రాందాస్ చౌరస్తాలో జరిగిన సభలో పంజా విజయ్ కుమార్ కు కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. నిజాంపేట జడ్పిటిసిగా టిఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి గెలుపొందిన విజయ్ కుమార్ ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తదితరులున్నారు.